బహుజనులు, అణగారిన పేద ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న అని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 373 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లకారం ట్యాoక్ బండ్ వద్ద గల సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బహుజనుల, అణగారిన, పేద ప్రజల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన వీర పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. పాపన్న గౌడ్ ఒక గౌడ కులానికే కాకుండా బిసి సామాజిక వర్గానికి, అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచారని అన్నారు.
సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని మేయర్ అన్నారు.