సిబిఐటి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ అమీర్పేటలోని రేడియంట్ హైస్కూల్లో స్కూల్ కెప్టెన్ ఎన్నికలను ఎలా నిర్వహించాలి అనే అంశం మీద కార్యశాల నిర్వహించారు. క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ జి.ఎన్.ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో నూతన సాంకేతికత ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఎన్నికలను ఎలా నిర్వహించవచో ప్రదర్సన ధ్వారా విద్యార్థులకు చూపించారు. విద్యార్థి సమన్వయకర్తలు భాను ప్రసాద్ మరియు ప్రశాంత్ ఎన్నికల కోసం అభివృద్ధి చేసిన యూజర్ ఫ్రెండ్లీ వెబ్ అప్లికేషన్ను ప్రదర్శించారు. పాఠశాల చైర్మన్ షరీఫ్, ప్రిన్సిపాల్ ఎస్ కె నాయర్ మరియు డైరెక్టర్ శైలజతో సహా పాఠశాల అధికారులు ఈ కార్యశాల లో పాల్గొన్నారు.