ఏపీ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాలతో అన్ని చెక్ పోస్ట్ ల వద్ద సంబంధిత పోలీసులు ‘ఆపరేషన్ నిఘా’ పేరుతో తనిఖీలు చేపట్టారు.
ఈ మేరకు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి మళ్లీ పోలీసులు ప్రధాన చెక్ పోస్ట్ ల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ రాజకుమారీ స్వయంగా రోడ్డు మీద ప్రత్యక్ష మయ్యారు. సారా, మద్యం, గంజాయి, గుట్కా అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టారు.
జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ నిఘా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన వాహన తనిఖీలను చేయడంలో స్వయంగా ఎస్పీ పర్యవేక్షించడం విశేషం.