గిరిజన ప్రాబల్యంతో అతి చిన్న జిల్లా గా ఉన్న ములుగు లో బాల్యవివాహాలు అరికట్టడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని SCPCR చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం, ప్రత్యేకమైన సంస్కృతి ఉన్న ములుగు జిల్లా లో బాలల విషయం లో విభిన్నమైన సమస్యలు ఉంటాయని ఆయన అన్నారు.
ఒక పరిపూర్ణమైన క్షేత్ర స్థాయి ప్రణాళిక రూపొందించుకొని సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలని ఈ విషయంలో రాష్ట్ర కమీషన్ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు.
ములుగు జిల్లా సంక్షేమాధికారి G. మల్లీశ్వరి అధ్యక్షతన జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వెబినార్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చిన్నజిల్లా అయినప్పటికీ వైశాల్యంలో పెద్దదిగా ఉన్న జిల్లాలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నందుకు ICPS సిబ్బందిని ఈ సందర్భం గా అభినందించారు.
అనంతరం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు శోభారాణి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల విషయం లో కఠినంగా వ్యవహరించాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై తప్పనిసరిగా కేసులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో CWC చైర్మన్ మండల పరశురాములు, సభ్యులు వనం బాలరాజు, మంజుల జిల్లా లోని CDPO లు, ACDPO లు, సూపరువైజర్లు, ICPS మరియు సిబ్బంది జూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ వెబినార్ కార్యక్రమం లో పాల్గొన్నారు.
కోవిడ్19 పరిస్థితుల్లో జిల్లాలో బాల్యవివాహాల స్థితిగతులపై వివరాలు అడగ్గా జిల్లా లో ఇప్పటివరకు తీసుకున్న బాలల సంరక్షణ చర్యలను సంక్షేమాధికారిణి G.మల్లీశ్వరి వివరించారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణాధికారి జె. ఓంకార్, BRB కోఆర్డినేటర్ K. స్వాతి మాట్లాడారు.
కోవిడ్19 లాక్ డౌన్ నాటి నుండి నేటి వరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా 18 బాల్య వివాహాలను ఆపామని తెలిపారు. 5 పొక్సో కేసులను,15 ఎలోప్ మెంట్ కేసులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లితండ్రులకు అప్పగించామని తెలిపారు. 132 CNCP పిల్లలను ఫాలో-అప్ చేశామని తెలిపారు.
5 గురు బాల కార్మికులను రెస్క్యూ చేశామని వివరించారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో 543 వలస కూలీల కుటుంబాలకు చెందిన బాలబాలికల నిత్యావసరాలు అందించామని తెలిపారు.