36.2 C
Hyderabad
May 7, 2024 14: 55 PM
Slider ప్రత్యేకం

డ్రగ్స్ పై పోరాటం కొనసాగిస్తాను: పట్టాభి

#pattabhitDP

యువత భవిష్యత్ కోసం రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై పోరాటం కొనసాగిస్తానని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. పట్టాభిరాం ఒక వీడియో సందేశం పంపారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోందని తెలిపారు.

రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీకి చెందినవారు ఒక కుట్రపూరిత ధోరణితో, కక్షసాధింపు ధోరణితో తనకు కొన్ని అవరోధాలు సృష్టించారని ఆయన అన్నారు. తన ఇంటిపై దాడులు చేసి తన కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులు గురి చేశారని పట్టాభి తెలిపారు.

గత రెండున్నరేళ్లు అనేక అంశాలపై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఆయన తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తన కుటుంబంపై మూడోసారి దాడి చేశారని పట్టాభి తెలిపారు. తాను లేనప్పుడు తన ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేయడమేకాకుండా ఆ సమయంలో ఇంట్లో ఉన్న తన 8 సంవత్సరాల ఏకైక కుమార్తెను భయకంపితురాలు చేశారని ఆయన అన్నారు.

ఏమాత్రం మానవత్వం లేకుండా తన బిడ్డను షాక్ కు గురిచేశారని, అమితంగా ప్రేమించే బాధ్యత గల ఒక తండ్రిగా ఆమె మనో వికాసం కోసం కొద్ది రోజులు బయటికి తీసుకొచ్చానని ఆయన అన్నారు. దానికి కూడా విపరీతార్థాలు తీయడం, అనేక కామెంట్లు చేయడం బాధాకరమని పట్టాభి అన్నారు.

Related posts

ఫ్రెంచ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో కనిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Satyam NEWS

ఆకాశంలో ఆందోళన: విమానానికి బాంబు బెదిరింపుతో ఉత్కంఠ

Satyam NEWS

కర్నాటక ఆదాయాన్ని మించిన ఆంధ్రా మందు

Satyam NEWS

Leave a Comment