29.7 C
Hyderabad
May 3, 2024 03: 48 AM
Slider ప్రత్యేకం

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం: ఏడుగురికి పాజిటివ్

#newvariant

దేశంలో కరోనా మహమ్మారి కొత్త రూపు ధరించి విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.

దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు.. ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని చెప్పారు. ఏవై.4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. మరోవైపు.. కేరళలో కొత్తగా 7 వేల మందికి కొవిడ్​ సోకింది. అక్కడ ఒక్కరోజే 482 మంది వైరస్ కారణంగా మరణించారు.

Related posts

బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

Sub Editor

ప్రజల్లో చైతన్య నింపుతున్న పోలీస్ కళాబృందం

Satyam NEWS

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

Satyam NEWS

Leave a Comment