29.7 C
Hyderabad
May 6, 2024 04: 22 AM
Slider విశాఖపట్నం

పెన్షన్ డబ్బులు ఎవరో దోపిడి చేశారట

#cash

ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పెన్షన్లు ఇచ్చేందుకు తీసుకువెళుతున్న డబ్బును ఎవరో దోచుకున్నారట. మాకవరపాలెం మండలంలో పింఛన్లు అందించేందుకు నగదు తీసుకెళుతున్న కార్యదర్శిని మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి 16 లక్షల 15 వేలు కాజేశారట. శెట్టిపాలెం ఇంచార్జి కార్యదర్శి నవ్యశ్రీ మాకవరపాలెం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి పంచాయతీ నిధులు 16 లక్షల 15 వేలు డ్రా చేసి తీసుకెళ్లుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దుంగవానిపాలెం వద్ద మాటువేసిన దొంగలు ఈ దోపిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ ధరించగా, వెనుక వ్యక్తి కర్చీఫ్ తో కళ్ళ దిగువభాగం వరకు కట్టుకున్నాడని చెబుతున్నారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పాకిస్తాన్ మల్టీ లాంచ్ రాకెస్ట్ సిస్టం ప్రయోజం విజయవంతం

Satyam NEWS

పేద ముస్లిం విద్యార్ధి హిదాయత్ చదువుకు డా.చదలవాడ ప్రోత్సాహం

Satyam NEWS

స్నేహితుల చేతుల్లోనే జ్ఞానేశ్వర్ హత్య

Satyam NEWS

Leave a Comment