పేద ముస్లిం విద్యార్థి హీదాయత్ కి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ప్రోత్సాహం అందచేశారు.స్థా నిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పట్టణంలోని 25వ వార్డుకు చెందిన ముస్లిం విద్యార్ధిని అభినందించారు.
ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ పట్టణానికి చెందిన చిన్నారి హిదాయత్ ఎన్టీఆర్ ట్రస్ట్లో సీటు సాధించడం సంతోషమన్నారు. బాలుని తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు సీటు సాధించేందుకు సహకరించిన డా౹౹చదలవాడ అరవింద బాబుకు,నారా లోకేష్ బాబుకు కృతఙ్ఞతలు తెలిపారు.
అనంతరం డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. చదువుకునేందుకు పేదరికం అడ్డంకి కారాదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ను నిర్వహించడం జరుగుతుందన్నారు.
అదే విధంగా రాష్ట్రంలోని ఎన్నో పేద కుటుంబాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యకు చేయూతను అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కుటుంబ ఉన్నతి, ఆర్ధిక పురోగతి చదువు ద్వారానే మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు ఎంపికైన విద్యార్ధి ఎంతటి ఉన్నత చదువులు అభ్యసించినా అందుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భరిస్తుందని ఈ సందర్భంగా డా౹౹చదలవాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెన్న బలకోటి రెడ్డి,కావూరి శ్రీనివాస్ రావు,ఏ వి ఆర్ తదితరులు ఉన్నారు.