రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమతూకంలో కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలపరచాల్సిన అవసరం ఉందని, ఇందుకు మునిసిపల్ ఎన్నికలు వేదిక కావాలని లోక్ సభ లో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. నేడు ఆయన వైరా లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో ప్రసంగించారు. 16, 17, 18, 19 వార్డ్ లలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామ టిఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.
నామా తో బాటు ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, తుళ్ళూరి బ్రహ్మయ్య, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కొనిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, కొనిజర్ల తెరాస పార్టీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీను, పోట్ల శ్రీను, బానోత్ బాలాజీ, మందపాటి వెంకటేశ్వర్లు, చేరుకుమళ్ళి రవి, నంజాల రవి ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.