33.7 C
Hyderabad
April 29, 2024 02: 01 AM
Slider ప్రపంచం

బ్రెజిల్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. ఫుర్నాస్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో సరస్సులో షికారు చేస్తూ సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లారు.

ఒక్కసారిగా పర్వతంలోని కొంత భాగం విరిగి రెండు బోట్లపై పడింది. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ షాకింగ్ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

క్షతగాత్రుల్లో మరో ముగ్గురు కన్నుమూయడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. జలపాతంలో మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారి కోసం రెస్క్కూ టీమ్స్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగాయి.

Related posts

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

Satyam NEWS

ప్రవీణ్ ప్రకాశ్ ను విధుల నుంచి తప్పించండి

Satyam NEWS

సైబర్ సేఫ్టీ పై జాన్సన్ గ్రామర్ స్కూల్ లో వర్క్ షాప్

Satyam NEWS

Leave a Comment