కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఆదివారం రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ చేపట్టగా జనం తెల్లవారు జాము నుంచే రేషన్ షాపుల ముందు బారులు తీరారు. దీనితో నిత్యావసర దుకాణాల ముందు ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
ప్రస్తుత కరోనా మహమ్మారి ని పారద్రోలే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపధ్యంలో ప్రజలకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ కార్యక్రమంను ఈ రోజు తెల్లవారుజామునుంచే చేపట్టారు. దింతో ప్రజలు బారులు తీరి ఒక్కరి కొకరు దూరంగా నిలుచోని సరుకులు తీసుకున్నారు.