గులాబీ జెండాయే అందరికి అండ అని, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోతె మండలం నామారం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం తో పాటు రాష్ట్రం లో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెరాస పార్టీలో చేరడం జరిగిందని, కొత్త పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ ఒక్క తెరాస పార్టీ నే అని అన్నారు.అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని తెరాస పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో అందరూ పని చెయ్యాలని తెరాస పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడొద్దని అందరు పార్టీ కోసం కలిసికట్టుగా పని చెయ్యాలని కోరారు.
టీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు రూపురేఖలు మారిపోయాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో కోదాడ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. పార్టీలో చేరినవారు వార్డ్ మెంబర్ లచ్చుమల్ల భద్రయ్య, ప్రసాదు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శాంతమ్మ, సురేషు, నరసయ్య, సాయిలు, కృష్ణయ్య, కమల్, వల్లి, నరసయ్య, సైదులు, భూషయ్య, వెంకన్న, సాలయ, భాస్కర్, అంజయ్య, వీరయ్య, నాగయ్య, గురవమ్మ, నాగమ్మ, పూలమ్మ, మల్లయ్య, ఝాన్సీ, నాగలక్ష్మి, ఆదమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురుజాల మన్సూర్, కళ్యాణి, యాదమ్మ, అనీలు, తదితర 200 కుటుంబాలు టిఆర్ఎస్ లో చేరారు.