అన్నమయ్య జిల్లా రాజంపేట లో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.మేడా భవన్ లో ఎమ్మెల్యే మేడా ను ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పూల మాలలు,వేసి బొకేలు అందించి శాలువాలు కప్పి జన్మించిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. కాగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మదన గోపాల పురం లో మాజీ ఎంపిటిసి యేసురు రెడ్డయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసురు రెడ్డయ్య మాట్లాడుతూ నిగర్వి పేదల పాలిట పెన్నిధి మల్లిఖార్జున రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకుని అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డిని కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు కె.విశ్వనాథరాజు, యస్.రామకృష్ణ, జె.బాస్కర్, వి.శివ,వై.హరికృష్ణ,ఆర్.శివరాం,బి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.