తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డిని కోరారు. వనపర్తిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదని, ఆర్యవైశ్య కులంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిన్నాం నరేందర్, చిగుల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్