29.7 C
Hyderabad
April 29, 2024 10: 02 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

#wanaparthycollector

రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నదని, సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్ విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వనపర్తిలో చెప్పారు. దానికి ఏడాదిన్నర సమయం పట్టిందని, వనపర్తిలో ఆరు రహదారులు నాలుగు లేన్లుగా విస్తరణ అంటే ఎంత కష్టపడాలో తనకు తెలుసున్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి కృషి అభినందనీయమని చెప్పారు. కేసీఆర్ ఆశీస్సులు, నా సహకారం సంపూర్ణంగా ఉంటుందని, కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం కాన్పులు పెరిగాయని చెప్పారు. దేశంలో తెలంగాణ ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందని, రాష్ట్రంలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి ఆసుపత్రులు, 30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం, పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్ సీయూ 18 ఎస్ఎన్ సీయూ కేంద్రాలను ఏడేళ్లలో 65 కి పెంచామని తెలిపారు. శిశుమరణాలను 25 శాతం నుండి 16 శాతానికి తగ్గించాం ,జాతీయ సగటు 22 శాతంగా ఉందని,ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికతో  ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

గత పాలకుల హయాంలో కుంటుబడిన అభివృద్ధి

కాంగ్రెస్ , టీడీపీ పాలనలో అభివృద్ది కుంటుపడిందని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు అభివృద్ది, ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 5 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రూ.1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వనపర్తి, నాగర్ కర్నూలులలో వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు , గద్వాలలో ఒక్కొక్కటి రూ.50 కోట్లతో నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేశామన్నారు.

ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాలలో 5 టి డయాగ్నస్టిక్ కేంద్రాలు, దేశంలో పేదలకు సేవలు అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఉత్తర ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉందని అన్నారు.ఆరోగ్యశ్రీ కింద పేదలు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు అందుకునేలా కేసీఆర్ ఆదేశించారని, రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారని చెప్పారు.

15 – 17 ఏళ్ల పిల్లలకు 90 శాతం మందికి వాక్సిన్ వేసి వనపర్తి జిల్లా అగ్రభాగంలో నిలిచిందన్నారు.జ్వర సర్వేకు సహకరించాలని ప్రజలను కోరారు. కోటి 27 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు రాష్ట్రంలో పంపిణీ చేశామని, 2 కోట్ల కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచామన్నారు.

కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని కోరారు. పరీక్ష కన్నా ముందు  లక్షణాలు కనిపిస్తే మందులు వాడడం ప్రారంభించాలని, ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

రెండు టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకినా ఇబ్బంది కలగడం లేదని, వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రజా ప్రతినిధులు పోటీ పడాలని పిలుపునిచ్చారు. ప్రాణాలకు ఎదురొడ్డి వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని,  ప్రజలు ప్రైవేటుకు వెళ్లకుండా  ప్రభుత్వ వైద్యశాల సేవలు అందుకోవాలని కోరారు.

హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సేవలు వనపర్తిలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తున్నారని చెప్పారు. ఒకేసారి 8 మెడికల్ కళాశాలలు కేసీఆర్ గారు మంజూరు చేయడం చారిత్రాత్మకమని, దేశంలో 153 వైద్య కళాశాలలు మంజూరు చేసినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని విమర్శించారు.

బీజేపీవి మాటలెక్కువ పని తక్కువని

వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించి, సీసీ రహదారి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగిస్తూ 330 పడకలతో వనపర్తి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కేసీఆర్ అశీస్సులు, హరీష్ రావు సహకారంతో వనపర్తి పచ్చబడిందని, వందేళ్లయినా సాగునీళ్లకు ఢోకాలేదని, బతుకుదెరువుకు భరోసానిచ్చారు.

ఆరోగ్యం, ఆర్థికం హరీష్ రావు చేతుల్లో ఉన్నాయని, వనపర్తి అభివృద్దికి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వనపర్తిలో మాతాశిశు ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వైద్యఆరోగ్య మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , కమీషనర్ వాకాటి కరుణ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , డీఎమ్ఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష , డీఎం & హెచ్ఓ చందునాయక్ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సాయంత్రం 6 తర్వాత కూడా మద్యం అమ్మేందుకు ప్లాన్ రెడీ

Satyam NEWS

డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు

Satyam NEWS

మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

Leave a Comment