ఆదిశిలా క్షేత్రమైన మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నేడు తులసి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా కార్తీక దామోదర స్వామి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, దీరేంద్ర దాస్, రవి, వాల్మీకి పూజారులు సాంప్రదాయ రీతిలో తులసి కళ్యాణం జరిపించారు.
తులసి బృందావనం దగ్గర దేవాలయ చైర్మన్ పట్వారీ ప్రహల్లాద రావు, ఈవో సత్యచంద్ర రెడ్డి పట్వారీ అరవిందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయ పరిసరాలు కార్తీక దీపాలతో నూతన శోభను కలిగించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు భక్తులు పాల్గొన్నారు.