తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసం కోల్పోతున్న టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకున్నదని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు ముసుగుల చంద్రారెడ్డి అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాకలో ప్రచారానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నేడు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బిజెపి శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా బిజెపి నాయకులు కార్యకర్తలు నినాదాలు చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నదని అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని చంద్రారెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం అందరికి ఉండాలని అలా కాకుండా అప్రజాస్వామికంగా ప్రవర్తించడం కరెక్టు కాదని ఆయన అన్నారు.