37.2 C
Hyderabad
April 30, 2024 11: 50 AM
Slider విజయనగరం

ఎన్.హెచ్.ఏ కార్డు పొందండి…బీజీపీ ఆఫీసులోనే పొందండి

#BJPVijayanagaram

రాష్ట్రంలో 11,800 మంది  అన‌ర్హులు: బీజేపీ నేత కుసుమంచి

గ్రామీణ‌,ప‌ట్ట‌ణ‌,న‌గ‌ర ప్రాంతాల‌లో ఉన్న ప్ర‌తీ ఒక్క ఆరోగ్యంపై కూడా ప్ర‌దాని మోడీ  ఎంతోదృష్టిసారిస్తున్నార‌ని అందులో బాగంగానే  నేష‌న‌ల్ హెల్త్  అధారిటీ కార్డును మంజూరు  చేస్తోంద‌ని ఏపీ రాష్ట్ర‌ బీజేపీ. స్వచ్ఛ భారత్ కో. కన్వీనర్ కుసుమంచి సుబ్బారావు  పేర్కొన్నారు. అస్స‌లు ఈ నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) హెల్త్ కార్డును ప్రతి వ్యక్తికి అందించవలసిన భాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని గుర్తు చేసారు.. త‌మ పార్టీ న‌గ‌రంలో కొన్ని డివిజ‌న్ ల‌లో ఇంటింటికి సర్వే  చేసి ఎన్హెచ్ఏ  లేని వారి వివరాలు తీసుకుంటోంద‌న్నారు.

ఈ మేర‌కు బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా హెల్త్ కార్డు ఇప్పిస్తున్నామని అన్నారు. హెల్త్ కార్డ్ తీసుకోదలిచిన వాళ్ళు స్థానిక జియార్ కాంప్లెక్స్ లోవున్న బీజేపీ అసెంబ్లీ కార్యలయానికి వచ్చి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా హెల్త్ కార్డ్ పొందవచ్చని తెలియజేసారు.అలాగే ప్ర‌దాని మోడీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా భారత దేశమంతటా రైతులకు ప్రతి ఏటా రూ. ఆరు వేలు ఇస్తోంద‌ని…. మన రాష్ట్రంలో జగనన్న పధకాలలో కలిపి ఇస్తోంద‌న్నారు.

అయితే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సర్వే చేయగా 11,800 మంది ఈ పధకంలో అనర్హులు వున్నారని… దీనివల్ల మూడేళ్లుగా 21 వేల కోట్లు దుర్వినియోగం జరిగాయని అయన ఆరోపించారు. ఈ పధకంలో వున్న అనర్హుల కార్డులను తొలగించాలని అయన డిమాండ్  చేసారు.ఇక ఉక్రెయిన్, రష్యా యుద్దంలో సుమారు  7 గంటలు ఆపడానికి ఇరు దేశాలతో మాట్లాడి యుద్దం ఆపించిన‌ ధీశాలి ప్ర‌ధాని మోడి అని విజ‌య‌న‌గ‌రం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కుసుమంచి అన్నారు.ఈ  కార్యక్రమంలో మండల నాయకులు సరిక వెంకటేశ్వరులు, జమ్ము రాంబాబు, శంకరరావు తదితరులు పాల్గోన్నారు.

Related posts

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Sub Editor

అంధత్వ నివారణ తెలంగాణ లక్ష్యం

Bhavani

రేసింగ్ పోటీల‌లో అప‌శృతి :13 ఏళ్ల శ్రేయ‌స్ దుర్మ‌ర‌ణం

Bhavani

Leave a Comment