31.7 C
Hyderabad
May 7, 2024 01: 39 AM
Slider హైదరాబాద్

8వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ

#modi

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్  విమానాశ్రయం  నుంచి నేరుగా ఆయన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు.  ముందుగా  తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే రోజున మోడీ  ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ రైలు కావడం విశేషం. 

ఈ రైలు వలన సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8.30 గంటల వరకు తగ్గనుంది. అనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.   రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు.

Related posts

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Satyam NEWS

మల్దకల్ బ్రహ్మోత్సవాలలో రేపు ధ్వజారోహణం

Bhavani

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక

Satyam NEWS

Leave a Comment