రాజస్థాన్లోని బార్మర్లో ఓ ప్రత్యేక సంఘటన తెరపైకి వచ్చింది. నెల రోజుల క్రితం, ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమ జంట రక్షణ కోసం పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అరెస్టు చేశారు….. ఇదేమిటి కొత్త ట్విస్టు అనుకుంటున్నారా? బార్మర్లో నివసిస్తున్న రిమ్జీమ్, స్వరూప్ సోనీల వయసు 22 ఏళ్లు.
వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. మే 20వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి బంగారం, నగలు, నగదు తీసుకుని ఇద్దరూ అజ్మీర్కు పారిపోయారు. అక్కడ ఆర్యసమాజ్ ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే రిమ్జిమ్, స్వరూప దొంగతనం చేశారంటూ రిమ్జీమ్ తల్లి సరూపిదేవి బార్మర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
వారిద్దరూ సోమవారం సాయంత్రం భద్రత కోసం పోలీసు స్టేషన్కు చేరుకోగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరిద్దరూ బంగారు గొలుసు, చెవిపోగులు, ఉంగరం, రూ.30 వేలు దొంగిలించారని మహిళ తల్లి ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.