ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సత్యవాడ దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కోనేరు సతీష్ శర్మ, కోశాధికారిగా అడవి వెంకటకృష్ణ, గౌరవాధ్యక్షులుగా తారానాథ్ శర్మ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి వి ఎస్ ప్రభాకర్ గుర్రాజు, వై జగన్నాధ రావు, రంగారావు కార్యదర్శులుగా ఎం శ్రీనివాస్ మనోహర్, సంయుక్త కార్యదర్శిగా వడ్డాది ఉదయ కుమార్ తో పాటు యువజన మహిళా అర్చక సమాఖ్య సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులు పదవీ స్వీకారం చేశారు. 13 జిల్లాల నుంచి సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
previous post