37.2 C
Hyderabad
May 6, 2024 22: 07 PM
Slider ముఖ్యంశాలు

విచారణ పేరిట తీన్మార్ మల్లన్నను వేధిస్తున్న పోలీసులు

#teenmar team

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ మొగుళ్ల భద్రయ్య ఆరోపించారు. చిలుకలగూడ పోలీసు స్టేషన్లో తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడానికి సిద్ధమైన పోలీసుల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలుస్తున్న తీన్మార్ మల్లన్నను పోలీసు విచారణ పేరిట వేధిస్తే తెలంగాణలో మరో ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున లేవబోతున్నదని అన్నారు. ఈ చర్యలను కొంతమంది కోవర్టులు, అక్రమార్కులతో ప్రభుత్వమే చేయిస్తున్నదని తెలంగాణ ప్రజలు భావిస్తున్న విషయం తెలుసుకోకపోవడం పాలకుల ఆధిపత్య అహంకారానికి నిదర్శనమని అన్నారు. త్వరలో ఎక్కడికక్కడ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టి ప్రజలకు దోషులుగా చూపిస్తామని తెలిపారు. జిల్లా కోకన్వీనర్  అచ్చునూరి కిషన్ మాట్లాడుతూ మల్లన్నపై పోలీసు వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తోట అనిల్, మార్త శ్రీనివాస్, ములుగు మండల కోకన్వీనర్ శనిగరపు ప్రవీణ్, సుశాంత్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడి సంభాషణ

Satyam NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవం

Bhavani

Leave a Comment