ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకున్నది. G20 దేశాల అధ్యక్ష పదవికి భారత్ ఎంపిక అయినందుకు జెలెన్స్కీ ప్రధానికి అభినందనలు తెలిపారు. తమకు మానవతా సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితిలో మద్దతు తెలిపినందుకు కూడా ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
previous post