33.2 C
Hyderabad
May 4, 2024 01: 36 AM
Slider గుంటూరు

సార్వత్రిక సమ్మెలో భాగంగా నరసరావుపేటలో అరెస్టుల పర్వం

police arrest

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపో ఎదుట తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. ఈ ఆందోళనలో అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులు కూడా పాల్గొని సార్వత్రిక సమ్మెకు తమ నిరసన తెలిపారు.

కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసు జులూం నశించాలంటూ వారు నినాదాలు చేశారు. ఆందోళనకారులను నరసరావుపేట పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.

Related posts

కొయ్యలగూడెం వద్ద ఆర్ టిసి బస్సు, లారీ ఢీ

Bhavani

న్యూ వైరస్:బ్రెజిల్లో కొత్త వైరస్‌ యారాగా నామకరణం

Satyam NEWS

జై కిసాన్ :పొలం దున్ని, నీరు పెట్టి రైతుగా మారిన తెలంగాణ మంత్రి

Satyam NEWS

Leave a Comment