కొయ్యలగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పులివాగు వంతెనకు దగ్గరలో లారీ ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 లో కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు.బస్సు జంగారెడ్డిగూడెం నుండి వాడపల్లి వెళ్తుండగా ఘటన జరిగింది.
అక్కడ వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై క్షతగాత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ ఆలస్యం చేశారని ఆరోపించారు.