40.2 C
Hyderabad
April 29, 2024 17: 59 PM
Slider ప్రత్యేకం

రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు తరలి రండి

#mlaseetakka

మే 6న వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమానులు, రైతు సోదరులు, యువకులు, పెద్ద ఎత్తున తరలి వచ్చి సభ విజయవంతం చేయాలని ఆమె కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు,రైతులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా  రైతు సంఘర్షణ సభ వాల్ పోస్టర్ ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్, మాజీ ఎంపీపీ లు కనతల నాగేంద్ర బాబు, జెట్టి సోమయ్య, మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పేండెం శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు

Related posts

జగన్ ప్రభుత్వం ‘చెత్త’ పన్ను: ఊరూరా రచ్చ రచ్చ

Satyam NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

డిసెంబ‌ర్ 10 లోగా ఆలయాల్లో అందుబాటులోకి కొత్త సేవ‌లు

Bhavani

Leave a Comment