ప్రతీ క్షణం…. చేతిలో లాఠీ ,మొలలో వెపన్….కళ్లలో రౌద్రం… ముఖంలో ఆందోళన తో ఉండే పోలీసులకు కాస్త విడుపు.విజయనగరం సర్ విజ్జీ స్టేడియం వేదిక గా టీ20 మ్యాచ్ నిర్వహించారు… జిల్లా పోలీసు బాస్ దీపికా. తన భర్త 5th బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ తో కలిసి బెటాలియన్ మరియు జిల్లా పోలీసు లకు కలిపి విజ్జీ స్టేడియం వేదిక గా ఉదయం 09.00 గంటలకు మ్యాచ్ ను ప్రారంభించారు… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ,జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు.ముందు గా ఇరు జట్లను ముఖ్య అతిధులకు పరిచయం చేశారు… జిల్లా ఎస్పీ బెటాలియన్ కమాండెంట్. ఈ సందర్భంగా కొద్ది సేపు…డిప్యూటీ స్పీకర్, జేడ్పీ చైర్మన్ లు బ్యాట్ ,బంతి పట్టుకుని కాసేపు మైదానంలో ఆట ఆడారు. అనంతరం ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత లాండ్ ఆర్డర్ పోలీసులు బ్యాటింగ్ కు దిగగా….ఎస్ఐలు గణేష్ ,లక్ష్మణరావు లు బ్యాటింగ్ కు దిగి ఫోర్లు కొట్టడంతో మ్యాచ్ రసవత్తరంగా జరిగింది.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా