విజయనగరం జిల్లాలో మూడోదశ పోలీంగ్ ఈ నెల 17 జరగనుంది. ఇప్పటికే జిల్లా పోలీసు శాఖ..3వేల మంది బస్తుతో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
ఈ మేరకు ముందు రోజు పోలింగ్ కు సంబంధించి… పోలీసు శాఖ సమావేశం కూడా నిర్వహించనుంది.ఈ నేపథ్యంలో విజయనగరం డివిజన్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలలో డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.
భోగాపురం సర్కిల్ పరిధిలో అతి సున్నిత గ్రామాలైన చింతపల్లి, కోనాడ, తిప్పలవలస, గుడివాడ, పోలిపల్లి, మోదవలస, డి.తాళ్లవలస గ్రామాల్లో విజయనగరం సబ్ డీఎస్పీ అనిల్ కుమార్, భోగాపురం సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, గ్రామ పంచయతీ ఎన్నికల్లో ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని, పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్