కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండికోట ముంపు నిర్వాసితులు అరెస్టుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.
దాంతో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీ పోలీసుల వలయంలో ఉండిపోయింది. పరిహారం కోసం నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి హామీ రాకపోగా వారిని అక్కడ నుంచి బలవంతంగా బయటకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే గండికోట జలాలు తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ కాలనీని చుట్టుముట్టాయి. ధర్నా చేస్తున్న నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ధర్నా ప్రాంతానికి భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి.