నిర్మల్ లోని SP క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా SP శశిధర్ రాజు జన్మదిన సందర్భంగా నిర్వహించిన ఈ పడి పూజకు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్పస్వామి విగ్రహాలకు పుష్పాభిషేకం, పంచామృతాలతో జరిగిన అభిషేకం, పదునేట్టంబడి కార్యక్రమాలను మంత్రి తిలకించారు.
ఈ కార్యక్రమంలో FSCS చైర్మన్ రాంకిషన్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటి చైర్మన్ ధర్మజి రాజేందర్, TRS జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాం చందర్ TRS టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, నాయకులు, మురళీధర్ రెడ్డి, గండ్రత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.