అనంతపురం పోలీస్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్డడీ సెంటర్ ను ఈరోజు అనంతపురం ఎం.పి తలారి రంగయ్య, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తో కలసి సందర్శించారు.
అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న డిజిటల్ లైబ్రరీని, కంప్యూటర్లు… డిల్లీ, హైదరాబాద్, నంద్యాల కోచింగ్ సెంటర్ల నుండి సేకరించిన బుక్స్, డిజిటల్ క్లాస్ రూంలలో సందర్శించి వీటి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడారు.
పోలీస్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్డడీ సెంటర్ నిర్వహణ బాగుందని… పోలీసు పిల్లల, నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇది ఎంతో దోహదపడుతుందని ఎం.పి వ్యక్తం చేశారు.