Slider మహబూబ్ నగర్

పోలీసులు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలి

#apoorvarao

వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని  వనపర్తి పట్టణ  పోలీస్టేషన్ ను వనపర్తి జిల్లా ఎస్పీ  కె.అపూర్వరావు తనిఖీ చేశారు. పెండింగ్ లో  ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను వనపర్తి పట్టణ ఎస్సై యుగందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

పోలీస్టేషన్ లో  రోజు వారిగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్టేషన్  రిసెప్షన్, లాకప్ ,మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్ ను సందర్శించి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం నమోదు చేసిన రిసెప్షన్ డైరీని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  విధుల పట్ల అంకితభావంగా ఉండాలని,  ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. 

న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. వనపర్తి పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించినా వెంటనే  తనిఖీ చేయాలని సూచించారు. అక్రమ మార్గంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలని తెలిపారు.  ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా  ప్రజలకు చైతన్య పరచాలని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ – 100 ద్వారా తెలుపవచ్చు అని సూచించారు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్  పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జీలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.

సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో  ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి సీఐ  ప్రవీణ్ కుమార్, వనపర్తి పట్టణ ఎస్సై  యుగంధర్ రెడ్డి, వనపర్తి పట్టణ రెండవ ఎస్సై  శివకుమార్, ఎస్పీ కార్యాలయం ఎ.ఎస్.ఐ. భాష, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

టీటీడీ డిసిషన్:85 టన్నుల నాణాలను కరిగిస్తాం

Satyam NEWS

బొబ్బిలి గ్రోత్ సెంట్రల్ లో అమాత్యుల రక్త సంబంధీకులు…!

Satyam NEWS

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన బిచ్కుంద ఎంపిడిఓ

Satyam NEWS

Leave a Comment