ఢిల్లీ లో ‘‘రైతులు’’ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై ఢిల్లీ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. రైతుల పేరుతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగి దాదాపు 300 మంది పోలీసులను తీవ్రంగా గాయపరిచారు.
మొత్తం అన్ని చోట్లా చెలరేగిన హింసకు సంబంధించిన సిసి కెమెరా ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కెమెరా ఫుటేజీలను పరిశీలించి రైతుల పేరుతో విధ్వంసం సృష్టించిన వారిని ఢిల్లీ పోలీసులు గుర్తిస్తున్నారు.
మొత్తం ఢిల్లీ లో ప్రస్తుతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనలను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. జరిగిన హింసాత్మక సంఘటనలపై సంయుక్త కిసాన్ మోర్చా సమీక్షాసమావేశం నిర్వహించింది.