కడప జిల్లా నందలూరు మండల కేంద్రం కడప చెన్నయ్ నేషనల్ హైవే ప్రక్కన కన్యక చెరువు లో శుక్రవారం రాత్రి మద్యం డంప్ బయటపడింది. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో తక్షణమే అక్కడకు చేరుకుని జేసిబి తో మద్యం డంప్ ను ధ్వంసం చేశారు.
పగిలిపోకుండా మిగిలిన మద్యం బాటిళ్లను మద్యపాన ప్రియులు వెతికి పట్టుకెళ్లారు. 2006 నుంచి 2015 వారికి పట్టుబడిన అక్రమ మద్యంను అప్పటి పోలీసుల పట్టుకున్నారు.
వాటి నిల్వ లు పోలీస్ స్టేషన్లో పేరుకు పోవడంతో, వాటిలో కొన్ని మూతలు తీసి కాలువల్లో పోశారు. మరి కొన్నింటి ని ధ్వంసం చేసి, మిగిలిన వాటిని పూడ్చి పెట్టారు. ఈ తతంగం మూడు నెలల క్రితం జరిగింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచం ను అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో వివిధ వాణిజ్య సముదాయాలతో పాటు మద్యం దుకాణాలను మూసి వేశారు. దీనితో మధ్య పాన ప్రియులు మద్యం కోసం తహతహ లాడు తున్నారు.
కాగా చెరువులో పోలీసులు మూట కట్టి పూడ్చి పెట్టిన మద్యం బయట పడడంతో మధ్య పాన ప్రియులు రాత్రికి రాత్రి కొన్ని మద్యం మూటలను తీసుకుపోయినట్టు తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జె సి బి తో మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. గతంలో పోలీసులు ఆక్రమంగా పట్టుకున్న మద్యం పూడ్చి పెట్టారని అవి ఇప్పుడు బయట పడడంతో ధ్వంసం చేసినట్టు ఎస్.ఐ ప్రసాద్ రెడ్డి తెలిపారు.