పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వెల్దుర్తి మండలం లో వైసిపి అధిపత్య పోరు నడుస్తున్నది. అక్కడి వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చెలరేగిన వివాదం కాస్తా ఘర్షణకి దారితీసి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వైసీపీ నాయకులు విద్యార్థుల ముందే వీధీ రౌడీలు లాగా కొట్టుకున్నారు.
విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో గ్రామానికి చెందిన వైసీపీలోని రెండు వర్గాల వారు విడిపోయి బాహబాహికి దిగారు. ఈ ఘటనతో విద్యార్థులు పారిపోయారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.