పాలిసెట్-2022 ప్రవేశ పరీక్ష జూన్ 30న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్ రెండో వారంలో స్వీకరించనున్నారు. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నోటిఫికేషన్ను జారీచేశారు. ఈ పాలి టెక్నిక్ ప్రవేశ పరీక్షకు పోటీ పడే విద్యార్థులు ఏప్రిల్ రెండోవారం నుంచి దరఖాస్తులను పోలిసెట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దాఖలుచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల దాఖలుకు జూన్ 4చివరి గడువు. అయితే, రూ.100 లేట్ ఫీజుతో జూన్ 5వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు.
previous post