42.2 C
Hyderabad
April 26, 2024 18: 39 PM
Slider రంగారెడ్డి

కుమ్మరి బస్తి లో విస్తృతంగా పర్యటించిన రజితపరమేశ్వర్ రెడ్డి

#ranjita

ఉప్పల్ డివిజన్ లోని కుమ్మరి బస్తి లో సోమవారం కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో  భూగర్భ డ్రైనేజీ నిర్మాణ  పనులను పరిశీలించారు. కాలనీవాసుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, లో ఓల్టేజి సమస్య పరిష్కారం కోసం నూతనంగా ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.  కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే కాలనీలో  సీసీ రోడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ  కార్యక్రమంలో గుమిడెల్లి కృష్ణ  ,మన్సూరాబాద్ యాదయ్య,పొట్లూరి శ్రీనివాస్  ,పొట్లూరి అశోక్  ,పొట్లూరి నవీన్ ,గుమిడెలి మహేష్ ,గుమిడెలి ఉదయ్ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,పాలడుగు లక్ష్మణ్ ,రాఘవేందర్ ,హనుమంత్ ,సుమన్ రెడ్డి ,నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

మందు కొట్టి బైక్ లు న‌డిపిన‌వారిపై కేసులు బుక్ చేస్తున్న పోలీసులు

Satyam NEWS

ముంపు ప్రాంతాలలో బురదను వెంటనే తొలగించాలి

Satyam NEWS

ఆర్టీసీపై కేసీఆర్ వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి

Satyam NEWS

Leave a Comment