భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కుమార్తె రుచిత వివాహం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో వైభవంగా జరిగింది. వివాహానికి హాజరైన రాజకీయ ప్రముఖులు వధువు రుచితను వరుడు సుమంత్ శ్రేయాస్ రెడ్డిని ఆశీర్వదించారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టీ.హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, షబ్బీర్ అలీ వివాహానికి హాజరయ్యారు. అదే విధంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, బిజెపి రాష్ట్ర నాయకులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సీనియర్ నాయకులు కొండపల్లి దయాసాగర్ రావు, రుద్రరాజు పద్మరాజు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు.