సీఎం సహాయనిధి నిరు పేదలకు ఒక వరం అని గంధం హైదరాబాద్ లోని రామాంతపుర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జొత్స్నానాగేశ్వరావు అన్నారు. రామంతాపూర్ డివిజన్ కి సంబంధిత సీఎం సహాయనిధి చెక్కులను స్వయంగా పేషంట్ ఇంటికి ఆమె అందించి వారి బాగోగులని అడిగి తెలుసుకున్నారు. గాంధీ నగర్ కు చెందిన మురళి కృష్ణ కు రూ.60000, ఇంద్రానగర్ కు చెందిన అనంద్ కు రూ.60000, భరత్ నగర్ కు చెందిన సత్యనారాయణ కు రూ.35000, అలాగే ఒల్డ్ రామంతపూర్ కి చెందిన సుజాత కి రూ.30000 వేల రూపాయల చెక్కులను గంధం జోష్న నాగేశ్వరరావు పంపిణి చేసారు. ఈ సందర్భంగా మాజి కార్పోరేటర్ గంథం జొత్స్నా మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపకారం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరు పేదలకు సీఎం కే సిర్
సీఎం సహాయనిధి ఏర్పాటు చేయడం వలన రాష్ట్రంలో అనేక పేద ప్రజలు లబ్ది పొందుతున్నారాన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ మందుగా సి ఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయసారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి