పరమపూజ్య జాతీయ సాధు బాలయోగి శ్రీ ఉమేష్ నాథ్ జీ మహారాజ్ అధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నంబావి మండల చౌరస్తాలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగినేని అభిలాష్ రావు విచ్చేశారు.
ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట చేసిన వాల్మీకి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షల తెలిపారు. ప్రపంచంలో మొట్టమొదటి కావ్యం రామాయణం అయితే అంతటి రామాయణాన్ని రచించిన గొప్ప మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి అని కొనియాడారు.
వాల్మీకి బోయ వారికి కులవృత్తిలేక జీవనోపాధికి అన్నమో రామచంద్రా అని జీవనం సాగడానికి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ జీవితం గడిపేవారు అని చెప్పవచ్చునని ఆయన అన్నారు. వాల్మీకి సోదరులందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో ఉండి ST జాబితాలో చేర్చే వరకు పోరాడాలని కోరారు. దీనికి తమ వంతు సాయం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సోదరులు, అఖిల పక్ష నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.