అసైన్డ్ భూములను సాగు చేసుకుంటూ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి రైతుకు న్యాయం చేసేలా కృషి చేస్తానని అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి తెలిపారు. కుడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామం,కల్లగళ్ల గ్రామాలలో ఆయన పర్యటించారు.
అనంతరం భూములు సాగు చేసుకుంటూ డి -పట్టాలు కోసం ఎదురుచూస్తున్న నిరుపేద రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎనిమిదవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో న్యాయం చేస్తామని తెలిపారు. సబ్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చేసిన కృషితో డిప్యూటీ కలెక్టర్ పర్యటన జరిగింది.
ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిన అనంతపురం జిల్లా సబ్ డివిజనల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ కు ఈ సందర్భంగా అక్కడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.