ఎన్ కౌంటర్ చేసిన దిశ హత్య కేసు నిందితులకు అదే స్థలంలో పోస్టు మార్టం కూడా పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి జనాలు తండోపతండాలుగా చేరుకున్నారు. సంఘటన స్థలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ జనాలు నినాదాలు చేస్తున్నారు.
ఎన్కౌంటర్ జరిగినందుకు జనాల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయింది. జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. సంఘటనా స్థలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఊపందుకున్నాయి.