మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లోని సుద్దాల వాగు పై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు.
ఈ మేరకు మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ వంతెన నిర్మించడం వల్ల స్థానికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రి దీనికి సానుకూలంగా స్పందించారు.