దక్షిణాది నుంచి భాజపా పతనం ప్రారంభమైందని, అన్ని చోట్లా ఆ పార్టీ ఖాతా ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో భాజపాకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. కర్ణాటక తీర్పుతో భాజపా నుంచి దక్షిణ భారతదేశానికి విముక్తి లభించిందన్న హరీశ్రావు..
ఈ చరిత్ర కొనసాగుతుందని ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 136, భాజపా 64, జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.