ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చివరి కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మల్లంపల్లి గ్రామం మండలం కావాలనేది జగదీష్ చివరి కోరిక అని, ఇటీవల కేటీఆర్ పర్యటనలో సైతం ఆయన KTRని ఇదే కోరారని ఎర్రబెల్లి గుర్తుచేశారు. మల్లంపల్లిని మండలం చేసి జగదీష్ పేరు పెడుతామన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తో తాము మాట్లాడుతామని జగదీష్ సంతాప సభలో మంత్రి హామీ ఇచ్చారు.
previous post
next post