ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయం లోని ప్రజావాణి హాలులో నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అదనపు కలెక్టర్లు మను చౌదరి, రాజేష్ కుమార్ ల జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ 29 ఫిర్యాదులను ప్రజల నుండి అందుకున్నారు. ఫిర్యాదులను ఎలాంటి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.