సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని భార్య చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో
కొంతమంది గ్రామస్తులు యాదయ్య అతని భార్యను గ్రామ నడివీధిలోని చెట్టుకు తాళ్లతో వేలాడదీసి కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.