39.2 C
Hyderabad
May 3, 2024 14: 57 PM
Slider ఆధ్యాత్మికం

దుర్గమ్మ ప్రసాదం రేట్లు పెరగబోతున్నాయ్

kanakadurga temple

బెజవాడ కనకదుర్గమ్మవారి ప్రసాదం రేట్లు పెరకబోతున్నాయి. అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని ఐదు రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు ఈవో ఎం వి సురేష్ బాబు తెలిపారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు  ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు భోగి మంటలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ నెల 30 న శ్రీ పంచమి సందర్భంగా‌ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ రోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనార్ధం వచ్చే భక్తులు సాంప్రదాయ‌ దుస్తుల్లోనే రావాలని ఈవో తెలిపారు. ఇకపై సంప్రదాయ దుస్తుల్లో రాకుంటే  అంతరాలయ దర్శనం ఉండదని ఆయన వివరించారు. అదే విధంగా 300 రూపాయల టిక్కెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Related posts

బొందిలి కులస్తులను ఓబీసీలలో చేర్చడానికి కృషి చేస్తాం

Satyam NEWS

నిజాంసాగర్ సింగితం రిజర్వాయర్లలో రొయ్య పిల్లల విడుదల

Satyam NEWS

కాగజ్ నగర్ కాలేజీలో కేసీఆర్ జన్మదిన హరితహారం

Satyam NEWS

Leave a Comment