27.7 C
Hyderabad
May 12, 2024 05: 54 AM
Slider ఆధ్యాత్మికం

చక్రస్నానంతో ముగిసిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

#tirumala

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం చక్రస్నానంతో ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వ‌హించారు.

ఉద‌యం 8.30 నుండి 10.15 గ‌టంల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత  శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి  ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

Related posts

వ్యాయామంతో క‌రోనా దూరం.. ఆరోగ్యం సొంతం

Sub Editor

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన హుజూర్ నగర్ ప్రైవేట్ టీచర్లు

Satyam NEWS

10 శాతం రిజ‌ర్వేష‌న్లపై హ‌ర్షాతిరేకాల వెల్లువ

Sub Editor

Leave a Comment