తెలంగాణా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు (ప్రతిజ్ఞ దివస్) శనివారం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా TGPA, స్వేరోస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శారదాబాయి వృద్ధుల ఆశ్రమంలో సీనియర్ సిటిజన్ ల మధ్య జరిపారు. ఆశ్రమంలోని వృద్దులకు పండ్లు, బ్రేడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు, ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం తాడ్వాయి, లింగంపేట్ బాలికల గురుకుల కళాశాలల్లో మొక్కలు నాటారు. స్వేరోస్ 10 కమండ్మెంట్స్ గురించి వివరించారు. విద్యయొక్క ప్రాముఖ్యత ను తెలియజేశారు. అంబేద్కర్, బహుజన ఆశయాల కోసం సుప్రీం స్వేరో శ్రమిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో TGPA జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, కార్యదర్శి సుధాకర్, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల గంగాధర్, జిల్లా జాయింట్ సెక్రెటరీ గౌతమ్,TGPA రాష్ట్ర నాయకులు బోగిడమీడి సాయిలు, యాదగిరి, జిల్లా నాయకులు గుంటి రాములు, కొడపగల్ రామచందర్, శంకర్, సైడం సాయిలు, మహిళ విభాగం లలిత, శోభ తదితరులు పాల్గొన్నారు.